SBI News : ఎస్బీఐ రీసెర్చ్ తన కస్టమర్లకు శుభవార్త అందించింది. తాజాగా ఈ సంస్థ ప్రజల్లో పొదుపు పెంచడానికి ట్యాక్స్ మినహాయింపు లిమిట్ పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వయసు పైబడిన భారత సిటిజన్స్కు రూ. లక్ష వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్స్ కల్పించాలని తెలియజేసింది. పన్ను ప్రయోజనాలతో కస్టమర్లకు భారీ ఊరట కలగనుంది.
SBI News : ఆ లిమిట్ పెంపు…!
SBI News : ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80 టీటీబీ కింద వృద్ధులకు రూ.50 వేల వరకు ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాలు అందుతున్నాయి. ఎవరైతే సీనియర్ సిటిజన్లు సేవింగ్స్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు తదితర పథకాల ద్వారా ఇంట్రెస్ట్ పొందుతారో వాటిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఇప్పటివరకు రూ.50 వేల వరకే ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ ఉండగా ఇప్పుడా లిమిట్ను రూ.1 లక్షకు పెంచాలని ఎస్బీఐ కేంద్ర ప్రభుత్వానికి అర్జీలు పెడుతోంది. అయితే భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ కీలక ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. దాంతో ప్రజలకు త్వరలోనే 50 వేల వరకు మినహాయింపు లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు.
మెడిక్లెయిమ్ చెల్లింపులుకు ఒక స్కీమ్
సేవింగ్స్ అకౌంట్ లేదా పొదుపు ఖాతా ద్వారా సంపాదించే వడ్డీ మొత్తాన్ని కస్టమర్లు మెడిక్లెయిమ్ చేసేలా అనుమతించేందుకు ఒక స్కీమ్ ప్రవేశపెట్టాలని ఎస్బీఐ రీసెర్చ్ అభిప్రాయ పడింది. మరోవైపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కూడా ప్రజలపై పన్ను భారం తగ్గించే దిశగా కేంద్రానికి పలు సూచనలు చేసింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ద్వారా వచ్చే రాబడిని సెక్షన్ 80టీటీబీ కిందకు తీసుకు వస్తే బాగుంటుందని ఐసీఏఐ కేంద్రానికి సిఫార్సు చేసింది.
వారికి ఎస్బీఐ తీపికబురు
కారు, ద్విచక్ర వాహనం, బంగారం, వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకునే వారికి తక్కువ వడ్డీ రేట్ కే రుణాలు అందిస్తామని తాజాగా రుణ గ్రహీతలకు ఎస్బీఐ తీపికబురు అందించింది. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపుతో సహా తక్కువ ఈఎంఐ బెనిఫిట్ అందిస్తామని వెల్లడించింది. అంతేకాదు కస్టమర్లు ఏ బ్రాంచ్కు వెళ్లాల్సిన పని లేకుండా ఆన్లైన్లోనే యోనో యాప్ ద్వారా లోన్ కోసం అప్లికేషన్ పెట్టొచ్చు.
SBI New Rules : SBI ఖాతాదారులకు అలర్ట్.. కొత్త రూల్స్ ఇవే..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?