కరోనా నేపథ్యంలో దేశంలోని స్కూళ్లే, కాలేజీలు, యూనివర్సిటీలు ప్రస్తుతం మూసి ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్నిరాష్ట్రాల్లో సెప్టెంబర్ నుంచి స్కూళ్లను విడతలవారీగా తెరవనున్నారు. కాగా కేంద్రం మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ విషయమై ప్రస్తుతం అనేక ఫేక్ వార్తలు ప్రచారమవుతున్నాయి. డిసెంబర్ వరకు స్కూళ్లను తెరవకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనే ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వార్తలో నిజం లేదని వెల్లడైంది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్లో.. పైన తెలిపిన ఆ వార్త ఫేక్ అని తేలింది. డిసెంబర్ వరకు స్కూళ్లను మూసి ఉంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుందనే వార్తలో ఏమాత్రం నిజం లేదని, అంతా అబద్దమని వెల్లడైంది. అసలు ఈ విషయంపై ఇప్పటి వరకు కేంద్రం నిర్ణయం తీసుకోలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్లో తేలింది.
A news agency has reported that the Central Government has decided to not re-open schools until December.#PIBFactCheck: Government has not made any such decision.#FakeNews pic.twitter.com/az7JDcOmWn
— PIB Fact Check (@PIBFactCheck) August 13, 2020
అయితే పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ నుంచి విడతలవారీగా స్కూళ్లను ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ముందుగా 10, 9, 8 తరువాత కింది స్థాయి తరగతులకు చెందిన స్కూళ్లను ఓపెన్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కానీ అమెరికాలో స్కూళ్లను ఓపెన్ చేశాక అక్కడ 97వేల మందికిగా పైగా చిన్నారులు కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రాలు స్కూళ్ల ఓపెన్పై పునరాలోచనలో పడ్డాయి. అయితే సెప్టెంబర్ వస్తే ఈ విషయంపై స్పష్టత వస్తుంది.