టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మెగా హీరోలకి ఉన్న ఫేం క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. మెగా హీరోల కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులకి పండగే. ఎప్పుడెప్పుడు ఇద్దరు మెగా హీరోలు కలిసి సినిమా చేస్తారా అని మెగా అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులందరు ఎంతో ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక మెగా హీరోల కాంబినేషన్ ని సెట్ చేయడం అన్నా.. ఆ హీరోలకి సరిపోయో విధంగా కథ ని సెట్ చేయాలన్నా దర్శకులకి కూడా పెద్ద సవాల్ అని చెప్పాలి.
ఇద్దరు మెగా హీరోల కి సరిపోయో కథ మాత్రమే కాదు ఇద్దరి పాత్రలు తయారు చేయడం కూడా కత్తి మీద సాము అని ఖచ్చితంగా చెప్పాలి. అందుకే చాలామంది డైరెక్టర్స్ అనుకుంటారు కాని అంత త్వరగా మాత్రం కథ సెట్ చేయలేకపోతున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమా నుండి మెగా హీరోలు ఆయనతో కొన్ని నిముషాల పాటు స్క్రీన్ పంచుకుంటున్నారు. ఆ కొన్ని నిముషాలు చాలు థియోటర్స్ దద్దరిల్లిపోవడానికి.
బావగారు బాగున్నారా సినిమాలో మెగా బ్రదర్ నాగ బాబు ఒక సాంగ్ లో కొన్ని సెకండ్స్ కనిపిస్తేనే ఫ్యాన్స్ ని అదుపుచేయలేకపోయారు. ఇక శంకర్ దాదాలో..శంకర్ దాదా జిందాబాద్.. సినిమాలలో చిరంజీవి పక్కన తమ్ముడు పవర్ స్టార్ కనిపించినప్పుడు మెగా అభిమానులకే కాదు ప్రేక్షకులందరికీ కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇక చిరంజీవి కూడా తనయుడు రాం చరణ్ తో కలిసి మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150 సినిమాలలో కనిపించి ఫ్యాన్స్ సరదాని తీర్చారు.
కాని అభిమానులకి అది చాలటం లేదు. ఇంకా టన్నుల కొద్ది కావాలి. అందుకే గత కొంతకాలంగా మెగా స్టార్ హీరోలు కలిసి ఒక మల్టీస్టారర్ లో నటించాలని సనాహాలు చేస్తున్నారు. కాని కథ రెడీ చేసే దర్శకులే కరువయ్యారు. అయితే ఎట్టకేలకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో కలిసి సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తాజా సమాచారం. అయితే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ నిర్మాతగా.. తన పవన్ కళ్యాణ్ క్రియోటివ్ వర్క్స్ బ్యానర్ లో రాం చరణ్ హీరోగా నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలుస్తుంది. మొత్తానికి మెగా హీరోల కాంబో లో సినిమా కష్టమే అనుకున్న అందరిని త్రివిక్రం దెబ్బ కొట్టాడు.