SEB Officers: ఆంధ్ర ప్రదేశ్ SEC మరియు జగన్ ప్రభుత్వం మధ్య ఎన్నో కోర్టు వివాదాల అనంతరం ఏపీలో పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం రాష్ట్రంలో చాలా చోట్ల ఏకగ్రీవలు ఊపందుకున్నాయి. అలాగే పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో చాలా మంది స్పెషల్ ఆఫీసర్ లను SEC నియమించారు. అంతేకాకుండా ఎస్ఈబీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు.
ఇందులో భాగంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టుల్లో ఎంతో నిశితంగా తనిఖీలు చేశారు. ఎస్ఈబీ అధికారులు ఈ ఎన్నికల వేళ భారీగా డబ్బు, బంగారం, మద్యం పట్టుబడ్డాయి. ఆందులోనూ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పట్టుబడ్డాయట. తాజాగా ఎస్ఈబీ అధికారులకు కడప జిల్లాలో చెక్పోస్టు దగ్గర తనిఖీలు చేస్తుండగా భారీగా డబ్బు పట్టుబడింది. ఈ డబ్బుని వారు ఏకంగా బండిపై తరలిస్తుండగా పట్టుకున్నారు.
ఎస్ఈబీ అధికారులకు కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో చెక్పోస్టు దగ్గర వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ సంఘటన బయటకు వచ్చింది. కడప జిల్లాలోని నకాష్ వీధికి చెందిన సయ్యద్ ఉమర్ అనే ఓ వ్యక్తి తన బండి పై పెద్ధ మొత్తం డబ్బుతో కమలాపురానికి బయలుదేరారు. అతడి బండి కడప-తాడిపత్రి ప్రధాన రహదారి దగ్గరకు చేరుకోగానే అక్కడ ఉన్న సిట్టింగ్ స్క్వాడ్ మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ అతని బండిని ఆపరు.
ఆ బండిని ఆపి తనిఖీ చేయగా వారికి అందులో రూ.10 లక్షలు డబ్బు పట్టుబడింది. సయ్యద్ అనే వ్యక్తి ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు అధికారులకు చూపించకపోవడంతో అతడిని సమీపంలోని పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు అతనికి ఈ డబ్బు ఎక్కడిది? అతడు ఎక్కడికి తరలిస్తున్నాడు అన్న విషయం ఇంకా తెలియాలిసి ఉంది.