జనసేన పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో దీర్ఘకాలం తర్వాత పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో పార్టీకి ఉన్న ఏకైక గురించి సైతం ఆయన ఆసక్తికరంగా స్పందించారు. సొంత ఎమ్మెల్యే గురించి పార్టీ నేతలతో చేసిన కామెంట్లు ఆయనతో పార్టీకి ఉన్న సంబంధాలను స్పష్టం చేస్తోందని అంటున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా ఆ నియోజకవర్గంలో…
మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరురూరల్, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల ఇంచార్జులు, నాయకులతో సమావేశంనిర్వహించారు. ఆ అయిదు నియోజకవర్గాల్లో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి అమలు చేస్తున్న ప్రమాద భీమా వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
వేల కోట్లు కాదంటున్న పవన్
అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు వెనకేసుకోవడం కాదు… ప్రజలుకోల్పోయిన వాటిని వారికి అందజేయడం కావాలి… జనసేన పార్టీ అది చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒక సమస్య ఉంటే దాని గురించి బలంగా ప్రస్తావించి మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా దాన్నిపరిష్కరిద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. తాను కోరుకుంటున్న క్రియాశీలక సభ్యులు ప్రజలు, పార్టీకి అందుబాటులో ఉండేవారై ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
ఆ ఎమ్మెల్యే గురించి….
రాజోలులోని పార్టీ ఎమ్మెల్యే గురించి జనసేన వర్గాలు ఆసక్తికరంగా స్పందించారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో స్పందిస్తూ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్ధి నుంచి సహకారం లేకున్నా ఆ నియోజకవర్గంలో స్థానిక నాయకత్వం ముందుకు వచ్చిందని అభినందించారు. 16 మంది రంగంలోకి దిగి బాధ్యత చేపట్టారని కితాబు ఇచ్చారు. పట్టుదలతో పార్టీపై విశ్వాసంతో నిలకడగా, నిజాయితీగా కష్టపడి పని చేశారని వెల్లడించారు.