తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తాడిపత్రి మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉంటారు. తాజాగా అక్రమ వాహన రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన ఆయన నిన్ననే బెయిల్ పై విడుదలయ్యారు. అయితే అంతలోనే ఆయనపై మరో కేసు నమోదవ్వడం విశేషం.
నిన్న కడప సెంట్రల్ జైలు నుండి 20కు పైగా వాహనాలతో ఆయన అనుచరులు ర్యాలీగా జేసీను ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని తీసుకెళ్లారు. అనంతపురం శివార్లలో ర్యాలీగా వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో ర్యాలీగా వెళ్లకూడదన్నారు. దీంతో కారు నుండి కిందకు దిగిన జేసీ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. తనకు కేసులు కొత్త కాదని, ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండని, మళ్ళీ అరెస్ట్ చేస్తావా, ఏం పీక్కుంటావో పో అంటూ దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు గాను జేసీ ప్రభాకర్ రెడ్డి పై సెక్షన్ 353తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు అనంతపురం పోలీసులు.