కరోనా దయ వల్ల అందరి రోజువారి అలవాట్లు మరియు విధి విధానాలు మారిపోయాయి. గత మూడు నెలలుగా మానవజాతి ప్రవర్తనలో ఎంతో మార్పు తీసుకువచ్చిన ఈ కరోనా బెడద దేవుడికి కూడా తప్పలేదు. దాదపు మూడు నెలలు భక్తులు లేక బోసిపోయిన దేవాలయాలు అన్నీ లాక్ డౌన్ లో ఇచ్చిన సడలింపులతో ఒక్క సారిగా పోటెత్తారు.
భక్తులందరూ ఎంతో భక్తితో ఇష్టంగా శ్రీవారికి సమర్పించే తలనీలాల విషయంలో కూడా విపరీతమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా విడుదలైన ఒక వీడియోలో తిరుపతిలో గుండు కొట్టే వారంతా డాక్టర్ల లాగా తెల్ల రంగు ఆప్రన్ వేసుకుని చేతికి గ్లౌజులు ధరించి ముఖానికి మాస్క్ వేసుకోవడం కాకుండా ఇంకా సేఫ్టీ కి కరోనా హెల్మెట్ కూడా పెట్టుకోవడం విశేషం.
ఇక కొంతమంది భక్తులు మాస్కులు పెట్టుకొని గుండు కొట్టించుకుంటున్నారు. అయితే గుండు కొట్టేవారు ఏ మాత్రం నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక 11వ తేదీ నుండి రాష్ట్ర నలుమూలల నుండి భక్త జన సందోహం తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలి వెళ్లారు. కానీ దర్శనం మాత్రం కేవలం ఒక అరగంటకి అయిపోతూ ఉండడం విశేషం.