భారత క్రికెట్ జట్టుకి చటేశ్వర్ పుజారా నయా ‘వాల్’ గా పేరు తెచ్చుకున్నాడు. గతంలో రాహుల్ ద్రావిడ్ ఎలా అయితే టీం కష్టాల్లో ఉన్నప్పుడు గడ్డు బ్యాటింగ్ చేసి జట్టు ని గట్టెక్కించే వాడు పూజారా కూడా అలాంటి ఇన్నింగ్స్ లు ఆడడంలో దిట్ట. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో దాదాపు 5 గంటలపాటు pujara క్రీజులో ఉండి ఎన్నో దెబ్బలు ఎదుర్కొన్నాడు. ఆసీస్ బౌలర్లు అతనిని టార్గెట్ చేసి బౌన్సర్లు సంధించారు.
చెయ్యి, తల, ఛాతీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క చోట అతని ఒంటికి బంతి తాకింది. అయితే ఆ నొప్పిని భరించడానికి వెంటనే మైదానంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ బంతి చాలా నొప్పి అయినప్పటికీ తాము వికెట్లు కోల్పోకూడదు కాబట్టి ఎంత నొప్పి అయినా భరించాను అని పుజారా తెలిపాడు. ఇక అటువంటి బంతులను డిఫెన్స్ చేయడానికి ప్రయత్నిస్తే అవి చేతి గ్లౌజ్స్ తగిలి ఔట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తన శరీరాన్ని ధైర్యంగా అడ్డు పెట్టాడు.
ఇక ఒక బంతి అయితే అతని చేతి వేలికి తగిలినప్పుడు ప్రాణం పోయినంత పని అయింది అని పుజారా చెప్పాడు. అక్కడే పుజారా నొప్పికి తట్టుకోలేక బ్యాటు విసిరివేయడం మనం చూడవచ్చు. అయితే పూజారా ఆడిన ఆట మొత్తం చూసిన తన చిన్నారి కూతురు ఇంటికి రాగానే త<డ్రికి చికిత్స చేస్తానని పుజారా భార్యకు తెలిపిందట.
ఇంటికి రాగానే నా కూతురు దెబ్బ తగిలిన చోట ముద్దులు పెడతాను అని చెప్పిందట. ప్రేమతో దగ్గరికి తీసుకొని గాయం అయిన చోట ముద్దు పెడితే ఆ గాయం మానుతుందని తన కూతురు నమ్ముతున్నట్లు చెప్పాడు పుజారా. ఎంతో ముద్దుగా ఉంది కదా…! ఇక ఈ రోజు పుజారా ఇంటికి వెళ్ళాడు. తన కూతురు ముద్దులతో తండ్రికి స్వాగతం పలికింది.