Sekhar kammula : టాలీవుడ్ లో చాలా కూల్ గా సినిమాలు చేస్తూ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అని క్రేజ్ తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరి ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కి రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది నుండి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ చేయగానే రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇక శేఖర్ కమ్ముల ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీకి కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేశారు. ఫిదా తర్వాత గ్యాప్ తీసుకున్న ఈయన లవ్ స్టోరీ నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు.
ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో త్రి భాష చిత్రం తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. దీనిని పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా తీయబోతున్నామని శేఖర్ కమ్ముల అధికారకంగా ప్రకటించారు. శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబో అనగానే ఆ సినిమా మరో హై రేంజ్ అని ఇప్పటి నుండే అందరిలో బాగా అంచనాలు పెరిగాయి. ఈ అంచనాలను అందుకునేలానే శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ధనుష్ తో పాటు మరో హీరో కూడా నటించనున్నట్టు లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది.
Sekhar kammula : మల్టీ స్టారర్ మూవీ అంటే డైరెక్టర్స్ కు పెద్ద ఛాలెంజ్.
పోలీస్ ఆఫీసర్ గా రెండవ హీరో కనిపించబోతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ హీరోను టాలీవుడ్ నుండి ఎంపిక చేసి బ్యాలన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇన్సైడ్ టాక్ ఏమిటంటే ఆ హీరో వరుణ్ తేజ్ అని సమాచారం. పాన్ ఇండియా మూవీ కాబట్టి హిందీ వర్షన్ కి బాలీవుడ్ నటుడు కూడా నటించే అవకాశాలు ఉన్నాయట. దీనిపై త్వరలో క్లారిటీ రానుందని సమాచారం. మల్టీ స్టారర్ మూవీ అంటే డైరెక్టర్స్ కు పెద్ద ఛాలెంజ్. ఇద్దరు హీరోలకు పర్ఫెక్ట్గా సీన్స్ రాసుకోవడంతో మరి ఈ ఛాలెంజ్ శేఖర్ కమ్ముల ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.