శేఖర్ మాస్టర్ తెలుసు కదా. టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రఫర్. అంతే కాదు. బుల్లి తెర మీద తెగ సందడి చేస్తుంటారు శేఖర్ మాస్టర్. ఆయన చాలా షోలలో పార్టిసిపేట్ చేస్తుండటంతో పాటు.. జడ్జిగానూ వెళ్తుంటారు. అందుకే ఆయనకు బుల్లితెర అభిమానులు కూడా ఎక్కువే. ఇక.. శేఖర్ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన డౌన్ టు ఎర్త్. చాలా తక్కువ మాట్లాడుతారు. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోరు. అందుకే ఆయన ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ కొరియోగ్రఫర్ గా వెలుగొందుతున్నారు.
శేఖర్ మాస్టర్.. బుల్లితెర మీదనే కనిపించడం కాదు.. తను ఒక యూట్యూబ్ చానెల్ పెట్టి.. తనకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా… శేఖర్ మాస్టర్.. కశ్మీర్ కు వెళ్లిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. కశ్మీర్ లో షూటింగ్ కోసం వెళ్లిన శేఖర్.. అక్కడ శ్రీనగర్ అందాలను తన కెమెరాలో బంధించి.. తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశారు.
శ్రీనగర్ లో మంచు కురుస్తూ ఉన్న దృశ్యాలు అచ్చం విదేశాలనే తలపిస్తున్నారు. ఇంత సుందరమైన ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నాయన్న విషయం కూడా చాలా మందికి తెలియదు.
మరి.. శ్రీనగర్ అందాలను చూపించడానికి శేఖర్ మాస్టర్ రెడీగా ఉన్నారు. చూడటానికి మీరు సిద్ధమా?