ఈటీవీలో ఈ దసరాకు ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. ఆ ప్రోగ్రామ్ పేరే అక్కా ఎవరే అతగాడు. ఈ ప్రోగ్రామ్ లో అక్క సంగీత కాగా… చెల్లెళ్లు యాంకర్ రష్మీ, వర్షిణీ. వీళ్లకు పెళ్లి చేయడం కోసం అక్క సంగీత పడరాని పాట్లు పడుతుంటుంది. ఇంతలో నవదీప్ వస్తాడు. వాళ్లలో నచ్చిన వాళ్లకు నవదీప్ ను ఇచ్చి పెళ్లి చేయడానికి సంగీత ప్రయత్నిస్తుంటుంది.
అయితే.. శేఖర్ మాస్టర్ ఇద్దరు చెల్లెళ్లను కాకుండా… అక్క సంగీత మీద మనసు పడతాడు. తనకు లైన్ వేస్తుంటాడు. తనను ఫ్లర్ట్ చేయడానికి పడరాని పాట్లు పడుతుంటాడు. దానికి సంబంధించిన ప్రోమోను మల్లెమాల వాళ్లు తాజాగా విడుదల చేశారు.
మధ్యలో నవదీప్ శేఖర్ మాస్టర్ కు పంచులు వేయడం.. పులిహోర బాగానే కలుపుతున్నారు మాస్టారూ.. అంటూ శేఖర్ మాస్టర్ పై నవదీప్ సెటైర్లు వేయడం ఆధ్యంతం నవ్వులు పూయిస్తుంది.
ఈ ప్రోగ్రామ్ లో సుడిగాలి సుధీర్ కూడా పాల్గొన్నాడు. మొత్తానికి దసరా రోజు ఫుల్లు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికి లోడెడ్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది అక్కా ఎవరే అతగాడు షో.