దసరా అయిపోయింది. ఇక.. వచ్చేది దీపావళి. నిజానికి దసరా కన్నా వేడుకలు ఎక్కవగా జరుపుకునేది దీపావళికే. దీపాల పండుగ దీపావళి వచ్చిందంటే చాలు.. అందరూ ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. ఇక.. టీవీ చానెళ్లకు కూడా పండుగే. ఆరోజు స్పెషల్ ప్రోగ్రామ్స్ వేసి ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుంటాయి.
దీపావళి సందర్భంగా ఈటీవీలో శ్రీకనకమహాలక్ష్మీ లక్కీ డ్రా అనే ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రామ్ కు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించగా… హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, శేఖర్ మాస్టర్, రోజా గెస్టులుగా వచ్చారు. జబర్దస్త్ టీమ్ సభ్యులు కూడా వచ్చి సందడి చేశారు. ఎవరైతే ప్రేక్షకులను నవ్వించి ఎంటర్ టైన్ చేస్తారో వాళ్లకు కిలో బంగారాన్ని దీపావళి సందర్భంగా బహుమతిగా అందజేయనున్నట్టు నిర్వాహకులు చెప్పగా.. ఇక.. నవ్వించడం కోసం అందరూ పడరాని పాట్లు పడ్డారు.
ఈనేపథ్యంలో.. లక్కీ డ్రా అంటే అదృష్టం ఉండాలి కదా.. శేఖర్ మాస్టారు.. మీ దృష్టిలో అదృష్టం అంటే ఏంటి? అంటూ శ్రీముఖి.. శేఖర్ మాస్టర్ ను అడుగుతుంది. అంతే.. ఇక శేఖరుడు ఊరుకుంటాడా? వెంటనే బిస్కెట్ వేసేశాడు. రోజా గారు నా ముందుండటమే నా అదృష్టం అని అనేస్తాడు. దీంతో రోజా చిరునవ్వులు చిందిస్తుంది.
వెంటనే అందుకున్న హైపర్ ఆది.. ముసలోళ్లకు దసరా పండుగ అని విన్నాం కానీ.. దీపావళి పండుగేంట్రా బాబు.. అంటూ హైపర్ ఆది పంచ్ వేసేసరికి.. స్టేజీ మీద నవ్వులే నవ్వులు.
దీపావళి రోజు స్పెషల్ ప్రోగ్రామ్ గా ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.