శేఖర్ మాస్టర్.. తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్. ప్రస్తుతం ఆయన బుల్లితెర మీద కూడా తెగ హంగామా చేస్తున్నాడు. శేఖర్ మాస్టర్ ఎక్కడ ఉంటే అక్కడ సరదానే. ఆయన చాలా కూల్ గా ఉంటారు. తన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కూల్ గా ఉంచుతారు. అందుకు శేఖర్ మాస్టర్ అంటే అందరికీ ఇష్టం.
అయితే.. తన అభిమానులకు మరింత దగ్గరగా ఉండేందుకు శేఖర్ మాస్టర్ యూట్యూబ్ చానెల్ ను కూడా స్టార్ట్ చేశారు. యూట్యూబ్ చానెల్ లో షూటింగ్ కోసం ఏదైనా కొత్త ప్లేస్ కు వెళ్తే ఆ ప్రదేశంలో వీడియో తీసి.. తన చానెల్ లో అప్ లోడ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్.
తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నభా నటేశ్.. మూవీ అల్లుడు అదుర్స్ షూటింగ్ కోసం శ్రీనగర్ వెళ్లినప్పుడు అక్కడ శ్రీనగర్ అందాలను తన కెమెరాలో బంధించారు. అలాగే.. అక్కడ ఆర్మీ జవాన్లు మంచు కురుస్తున్నా.. మైనస్ డిగ్రీల చలి ఉన్నా.. ఎంతో కష్టపడి దేశాన్ని రక్షిస్తున్నారని వాళ్లు నిజంగా గ్రేట్ అంటూ వాళ్ల గురించి గొప్పగా చెప్పారు శేఖర్ మాస్టర్.
శ్రీనగర్ లో ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. అక్కడ కురిసే మంచుకు బయట 10 నిమిషాలు తిరిగితే చాలు.. శరీరం మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. అటువంటి ప్లేస్ లో జవాన్లు 24 గంటలు మంచులో ఉండి.. చలికి వణుకుతూ దేశం కోసం కాపలా కాయడం అనేది నిజంగానే గ్రేట్.
ఈ విషయం ప్రతి భారతీయుడు తెలుసుకోవాలంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియోను శేఖర్ మాస్టర్ యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశారు.