టాలీవుడ్ సీనియర్ నటుడు విద్యాసాగర్ రాజు (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా పక్షవాతంలో అస్వస్థతకు గురైన విద్యాసాగర్ రాజు ఆరోగ్యం విషమించి ఈ రోజు తుది శ్వాస విడిచారు. మాయలోడు, రాజేంద్రుడు – గజేంద్రుడు, అహనా పెళ్లంట, స్వాతిముత్యం, ఆఖరి క్షణం లాంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విద్యాసాగర్ రాజు.. తన సినీ ప్రస్థానంలో వందకు పైగా చిత్రాల్లో నటించారు. రచయితగానూ పేరు తెచ్చుకున్నారు.
విద్యాసాగర్ రాజు సతీమణి రత్నప్రభ కూడా పలు సినిమాల్లో నటించారు. జంద్యాల సినిమాల్లో ఎక్కువగా ఆమె నటించారు. విద్యాసాగర్ రాజు నాటకరంగం నుండి సినీ రంగంలోకి వచ్చారు. ఈ చదువులు మాకొద్దు అనే అభ్యుదయ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన విద్యాసాగర్ రాజు సినిమాల్లో అనేక రకాల పాత్రలను పోషించారు.