మహేష్ బాబు హీరోగా లాంచ్ అయింది సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అన్న విషయం తెలిసిందే. చెప్పాలంటే మహేష్ బాబు హీరోగా మారిన తర్వాత ఎక్కువగా సీనియర్ దర్శకులతోనే సినిమాలు చేశాడు. బి.గోపాల్, వైవిఎస్ చౌదరీ, కృష్ణవంశీ, పూరి జగన్నాధ్, త్రివిక్రం, గుణశేఖర్ ఇలా దాదాపు అందరూ సీనియర్ దర్శకుల తో పని చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అయితే గత కొంతకాలంగా మహేష్ బాబు సక్సస్ లలో ఉన్న దర్శకులకే డేట్స్ ఇస్తాడని చెప్పుకుంటున్నారు.
మహేష్ బాబు కి పోకిరి, బిజినెస్ మాన్ లాంటి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాధ్ కి మహేష్ బాబు మళ్ళీ మూడవ సినిమా ఛాన్స్ ఇవలేదు. అందుకు కారణం పూరి వరస ఫ్లాపుల్లో ఉండటమే అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ మధ్య మహేష్ బాబు పూరి జగన్నాధ్ వచ్చి కథ చెబితే .. నచ్చితే గనక వెంటనే చేస్తానని చెప్పుకొచ్చాడు. దాంతో పూరి జగన్నాధ్ కూడా అందుకు సిద్దంగా ఉన్నాడని త్వరలో పూరి మహేష్ ని కలిసి కథ నెరేట్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా జనగణమన తెరకెక్కాల్సి ఉండగా అది కార్యరూపం దాల్చలేదు.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా మహేష్ బాబు యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలిస్తూ వస్తున్నాడు. వారిలో కొరటాల శివ, వంశీపైడిపల్లి, అనిల్ రావిపూడి, పరశురాం ఉండటం విశేషం. కొరటాల శివ డెబ్యూ సీమాగా ప్రభాస్ తో మిర్చి తీసి హిట్ కొట్టాడు. వెంటనే మహేష్ బాబు కొరటాల శివకి ఛాన్స్ ఇచ్చాడు. ఇక వంశీ పైడిపల్లి కూడా ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహర్షి సినిమాకి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. ఇక పటాస్ నుంచి ఎఫ్ 2 వరకు వరసగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి కి సరిలేరు నీకెవ్వరు సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు.
ఇప్పుడు సర్కారు వారి పాట కి యంగ్ డైరెక్టర్ పరశురాం కి అవకాశం ఇచ్చాడు. పరశురాం గీత గోవిందం సినిమాతో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కి డీసెంట్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ బాబు – పరశురాం కాంబినేషన్ లో రాబోతున్న సర్కారు వారి పాట సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మహేష్ బాబు గత కొంత కాలంగా సీనియర్ దర్శకులకి కంటే యంగ్ డైరెక్టర్స్ కే ఛాన్సులు ఇవ్వడం తోనే ఇలా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా మహేష్ బాబు వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకోవడం మాత్రం గొప్ప విషయం.