Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీస్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న శర్వానంద్ కి జంటగా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది.
శతమానం భవతి తర్వాత శర్వానంద్ కి సరైన హిట్ లేదు. ఆయన ఎంతో నమ్మకంగా చేసిన పడి పడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దాంతో మళ్ళీ మంచి ఫ్యామిలీ కథతో హిట్ కొట్టాలని ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద టైటిల్ తోనే చిత్ర బృందం బాగా అంచనాలు పెంచేసింది.
Sharwanand : ఈ సినిమాతోనైనా శర్వానంద్ కి అనుకున్న హిట్ దక్కుతుందో లేదో చూడాలి.
ఈ నేపథ్యంలో ఆ అంచనాలను మరింతగా పెంచే లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇచ్చారు చిత్ర బృందం. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో తాజాగా ముగ్గురు ఫీమేల్ క్యారెక్టర్స్ ని అనౌన్స్ చేశారు. ఇందులో అలనాటి క్రేజీ హీరోయిన్స్ ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి నటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు పూర్తయితే ఈ ఏడాదిలోనే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతోనైనా శర్వానంద్ కి అనుకున్న హిట్ దక్కుతుందో లేదో చూడాలి.