మీకు తెలుగు సినిమా అన్నమయ్య గుర్తుందా? గుర్తుండకపోవడం ఏంది? ఆ సినిమాను ఆ సమయంలో థియేటర్ లో చూడని వారు ఉండరు.. అంటారా? అయితే.. మీకు ఆ సినిమాలో నటించిన హీరోయిన్ కస్తూరి గుర్తున్నదా? గుర్తుంది అయితే ఏంటి అంటారా? ఆమె గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది. ఆమె ఓ ఇంటర్వ్యూలో కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది.. పదండి వివరంగా తెలుసుకుందాం..
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది కస్తూరి. ఆ తర్వాత అసలు వెండి తెర మీదనే కనిపించలేదు కస్తూరి.
తాజాగా ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ లో దర్శనమిచ్చింది. తన సినిమా కెరీర్, ఫ్యామిలీ, ఇష్టాలు, కష్టాలు అన్నీ ఆ ప్రోగ్రామ్ లో పంచుకున్నది. అంతేనా.. కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేసిందండోయ్. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం. ఆయన టచ్ అస్సలు మరిచిపోలేను. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నా క్రష్. క్రికెటర్ ధోనీ అంటే ఎంతో ఇష్టం. అన్నమయ్య సినిమా షూటింగ్ సమయంలో ఓసారి నాగార్జున నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంతే.. పడిపోయా. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన చేయిని చూస్తూ అలాగే పడుకున్నా. నా లైఫ్ టైమ్ క్రష్ మాత్రం నాగార్జున గారే.. అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నది కస్తూరి.
మరి.. జీవితంలో ముగ్గురు మగాళ్లకు నిద్రపోయే సమయంలో ఫోన్ చేస్తారా? అని ఆలీ చిలిపి ప్రశ్న వేయగా… వెంటనే తడుముకోకుండా… నా మంచం మీద ఎప్పుడూ ముగ్గురు మగాళ్లు.. అంటూ చెప్పేసింది కస్తూరి. ఆ వెంటనే ప్రోమో కూడా ఎండ్ అయిపోయింది. మరి.. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆమె ఏం మాట్లాడిందో తెలియాలంటే మాత్రం ఆ షోను చూడాల్సిందే.