లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వ అనుమతులతో యంగ్ హీరోలందరు తమ తమ సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అయిపోయారు. కాని 60 ప్లస్ హీరోలే ఇంకా సెట్స్ లో అడుగు పెట్టాలంటే ఆలోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ సినీయర్ హీరోలలో ఒక్క అక్కినేని నాగార్జున మాత్రమే కరోనా ని లెక్క చేయకుండా రెండు నెలల క్రితమే మేకప్ వేసుకొని సెట్స్ లో అడుగు పెట్టాడు. బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూనే వైల్డ్ డాగ్ సినిమా ని చక చకా కంప్లీట్ చేసేస్తున్నాడు.
కాని సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ మాత్రం ఇంకా షూటింగ్ లో పాల్గొనడానికి వెనకడుగు వేస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ది కూడా ఇదే పరిస్థితి. వయసు 60 ప్లస్లో ఉండడంతో కరోనాకు ఈ హీరోలు భయపడుతున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు మరో రెండు సినిమాలు రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అలాగే సీనియర్ హీరోలందరూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులని బట్టి వయసు రీత్యా రిస్క్ చేయడం కరెక్ట్ కాదన్న భావనతో షూటింగ్లో పాల్గొనడానికి భయపడుతున్నారనేది ఇన్సైడ్ టాక్. అయితే.. నాగార్జున మాత్రం కరోనా నిభంధనలు పాటిస్తూ సముద్రమట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం నాగ్ ఈ సినిమా షూటింగ్ లో ఉండటం వలనే బిగ్ బాస్ కి కూడా రాలేదు.
కాగా వెంకటేష్ నారప్ప సినిమా కంప్లీట్ చేయాల్సి ఉండగా బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాతే సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా తెలుగులోను రిలీజ్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినియర్ హీరోలు తమ సినిమాలతో 2021 లోనే సెట్స్ లో అడుగుపెడతారని తెలుస్తుంది.