తాడేపల్లి: ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డిని సోమవారం సాయంత్రం పలువురు సీనియర్ ఐఎఎస్లు, ఐపిఎస్ అధికారులు కలిశారు.
విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు మర్యాదపూర్వకంగా జగన్తో భేటీ అయ్యారు. జగన్ను కలిసిన వారిలో సీనియర్ అధికారులు కృష్ణబాబు, సంధ్యారాణి, వరప్రసాద్, లక్ష్మీకాంతం, సత్యనారాయణ, ఐజి సంజయ్, ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా, సత్యనారాయణ, ఎస్పిలు రవిప్రకాష్, మేరి ప్రశాంతి తదితరులు ఉన్నారు.
ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సమీక్ష
30వ తేదీన జరిగే ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై అధికారులతో జగన్ సమీక్ష జరిపారు. ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 30న ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియామకం జరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన సోమవారం కొద్దిసేపు జగన్తో భేటీ అయ్యారు.