ఇదేదో సినిమా స్టోరీ హెడ్డింగ్ అని అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో మూడు వేల జనాభా కలిగిన ఒక ఊరిలో దాదాపు 200 మంది ఖాతాదారు ఎకౌంట్లో 13000 నుండి 16000 రూపాయలు ఎకౌంట్లో పడటం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకం కింద ఈ డబ్బులు వేసింది అది కూడా కాదు.
అప్పట్లో తుఫాను నేపథ్యంలో డబ్బులు ఏమన్నా పడ్డాయి అంటే అది కూడా కాదని టాక్, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చింది అంటే అది కూడా కాదు. దీంతో బ్యాంకు ఖాతాదారులకు మరియు బ్యాంకు సిబ్బందికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ రైతు భరోసా డబ్బులు అనుకుంటే ఏడు వేల రూపాయలు అయినా పడాలి లేకపోతే 2000 రూపాయలు అయినా పడాలి.
కానీ 13 వేలకు పైగా డబ్బులు పడటం తో మా ఊరి జనం ఖర్చు పెట్టుకోటానికి భయపడుతున్నారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే భూమిలేని వారికి అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఇంత మొత్తంలో డబ్బులు పడటం. ఈ తరుణంలో ఖాతాదారులకు టెన్షన్ పట్టుకుంది. ఎక్కడి నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుందో ఎవరికి అర్థం కావటం లేదు. విజయనగరం జిల్లా శివరాం పురం గ్రామంలో 607 కుటుంబాల కలిగిన ఈ ఊరిలో మూడు వేల మంది జనాభా ఉన్నారు. అయితే వీరిలో రెండు వందల మంది బ్యాంకు ఖాతాలోకి ఒకేసారి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పడటంతో ఈ ఊరి పేరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.