రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు జీవితాంతం వెంటాడుతుంటాయి. అలా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును సైతం ఓ అంశం వదిలపెట్టడం లేదు. అదే ఓటుకు నోటు కేసు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఇంకా షాకింగ్ పరిణామాలు జరుగుతున్నారు.
ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు హైకోర్టులో నిరాశ ఎదురైంది… ఓటుకు నోటు కేసు నుంచి సండ్ర వెంకట వీరయ్యను తొలగించేందుకు హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన డిశ్చార్జ్ హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి , ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వర్గం నుండి ప్రాణహాని ఉందంటూ ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు.
నన్ను చంపించేందుకు కుట్ర….
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది. ఓటుకు నోటు కేసులో తాను అప్రూవర్ గా మారినందుకు తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని జెరుసలేం మత్తయ్య ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు ఈడీ నుండి నోటీసులు వచ్చాయని తెలిపాడు. ఈ కేసులో తమను పావులుగా వాడుకొని రేవంత్ రెడ్డి ఇరికించారన్నాడు. ముఖ్య సూత్రధారులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు అని అన్నారు. ఈ కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించి త్వరగా నిజాలను బయటపెట్టాలని ఆయన కోరారు. కేసు పూర్తైయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని హెచ్చార్సీను కోరినట్లు మత్తయ్య తెలిపారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ …
ఇదిలాఉండగా, ఓటుకు నోటు కేసుపై ఏసీబీ న్యాయస్థానంలో జరిగింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరు కాగా… ఈనెల 15వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని నిందితులందరినీ ఆదేశించింది ఏసీబీ కోర్టు.. హాజరు మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు వచ్చిన రెండ్రోజుల వ్యవధిలోనే మత్తయ్య ఇలా కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.