ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్షాలు తాజాగా ఓ రేంజ్లో టార్గెట్ చేసిన అంశం . “35 సంవత్సరాలు నిండిన వాలంటీర్లను తొలగించనుండటం“ దీనిపై పెద్ద దుమారమే రేగింది.
“ఏపీలో 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వాలంటీరు సచివాలయం, వార్డు వాలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్, కమిషనర్ జీఎస్. నవీన్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. “ అంటూ మీడియాలో వైరల్ చేశారు. అయితే, దీని వెనుక అసలు కారణం ప్రభుత్వం వెల్లడించారు.
అసలు సంగతి ఏంటి?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాల పథకాల అమలులో భాగంగా సంక్షేమ లబ్ధిని ఇంటింటికీ అందించే లక్ష్యంతో గ్రామ వాలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు. 50 ఇళ్లకు ఒక వాలంటీరును నియమిస్తూ రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. ఈ సంఖ్య ఒక్కో జిల్లాలో 30 వేలకు పైబడే ఉంది. అయితే, వీరి విషయంలోనే తాజాగా రచ్చ రచ్చ జరిగింది.
ప్రచారం ఏం జరిగింది?
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 35 ఏళ్లు నిండిన వాలంటీర్ల నియామకం జరిగిన దృష్ట్యా వారిని విధుల నుంచి తొలగించాలని, ఆ ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయని పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఈ ఉత్తర్వులు ఖచ్చితంగా అమలైతే జిల్లాల్లో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 35 సంవత్సరాల వయస్సు దాటిన వారి సంఖ్య వందల్లో ఉండే అవకాశం ఉంది.నిబంధనలు అనుసరించి 35 సంవత్సరాలు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వాలంటీరును ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది.
నిజం ఇది…
వాలంటీర్ల తొలగింపు అంశం వివాదంగా మారడంతో, గ్రామ వాలంటీరు సచివాలయం, వార్డు వాలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్, కమిషనర్ జీఎస్. నవీన్కుమార్ మంగళవారం స్పష్టత ఇచ్చారు. “అందరికీ తెలియచేయునది ఏమనగా 35 సంవత్సరములు నిండిన వాలంటీర్లను తొలగించుచున్నామని ఒక పత్రికలో అనవసమైన అనుమానములకు తావిచ్చేలా, వాలంటీర్లను అనవసరమైన భయాందోళనలకు గురిచేసేలా వార్తను ప్రచురించుట జరిగినది. వాస్తవముగా అది కేవలము నిబంధనలకు విరుద్దముగా ఎంపిక కాబడిన కేవలము 6 మందిని మాత్రమే తొలగించవలసినదిగా తెలియచేయడమైనది. మిగిలిన వారెవరూ తొలగించబడరు. కావున నిబంధనలకు అనుగుణంగా నియమించబడిన ఏ వాలంటీరు ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దు అని తెలియచేయడమైనది. కమిషనరు & డైరెక్టరు, వాలంటీర్లు & సచివాలయ శాఖ,“ అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో పెద్ద వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టినట్లయింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?