Raja Sekhar : మొన్నామధ్య కరోనా పాజిటివ్ రావడంతో దాదాపు చావుబతుకుల మధ్య దాకా వెళ్ళినా యాంగ్రీ మెన్ సీనియర్ స్టార్ నటుడు రాజశేఖర్ కోలుకుని బయట ప్రపంచంలో ప్రస్తుతం యధావిధిగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో భారీ గ్యాప్ ఇచ్చిన రాజశేఖర్ “గరుడవేగ” సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకుని.. ఆ తర్వాత ‘కల్కి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పెద్దగా సినిమా ఆడలేదు. భారి అంచనాల మధ్య విడుదలైన ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మలయాళం సినిమా జోసెఫ్ అనే మూవీ ని తెలుగులో రీమేక్ చేయాలని రాజశేఖర్ డిసైడ్ అవటమే కొండా దానికి డైరెక్టర్ గా నీలకంఠ బాధ్యతలు వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్టు పనులు కూడా పూర్తవడం జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ప్రాజెక్టు నుండి సడన్ గా నీలకంఠ తప్పుకున్నట్లు.. క్రియేటివిటీ లో తేడా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం వర్గాలలో టాక్. దీంతో సినిమా అర్ధాంతరంగా ఆగిపోవటం తో ఈ చిత్రం పూర్తి చేసే బాధ్యతను రాజశేఖర్ భార్య జీవిత తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఈ వార్త ఇంకా బయటకు రాలేదు అంట. గతంలో రాజశేఖర్ నీ హీరోగా పెట్టి జీవిత శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే అనే సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇలాంటి తరుణంలో చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ మలయాళం రీమేక్ సినిమా తో రాజశేఖర్ నీ.. జీవిత డైరెక్ట్ చేస్తున్నట్టు వార్తలు రావడంతో ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.