వైసీపీ ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతిలో ఉప ఎన్నికలు షురూ అయిన సంగతి తెలిసిందే. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతంలో ఏపీలో ప్రధాన పార్టీలు వైసీపీ, బిజెపి, టిడిపి గెలుపు కోసం ఎవరికి వారు వ్యూహాలు వేసుకుంటూ ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో అన్నిటికంటే తెలుగుదేశం పార్టీ చాలా స్పీడ్ గా ఉంది.
తిరుపతి ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడం జరిగింది. మరోపక్క బిజెపి జనసేన పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి అంతర్గతంగా చర్చలు జరుపుతున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టి గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా వ్యూహాలు వేస్తోంది. ఇలాంటి తరుణంలో తిరుపతి ఉప ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోటీ చేయడానికి రెడీ అవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
తమ జాతి ఉనికిని నిలబెట్టుకోవటం కోసం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు మందా కృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై చిత్తూరు అదేవిధంగా నెల్లూరు జిల్లాల నాయకులతో తిరుపతి లో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. గతంలో ఎస్సీ వర్గీకరణ కి బిజెపి టిడిపి వైసిపి పార్టీలో సమర్థించడం జరిగాయని పేర్కొన్నారు. కానీ సమస్య పరిష్కరించడం విషయంలో పార్టీలు అశ్రద్ధ వహిస్తే ఉన్నాయని, మాట ఇచ్చి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా గాని ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టడం లేదని అంతమాత్రమే కాదు కనీసం చర్చకు కూడా తీసుకు రావటం లేదని విమర్శించారు. గతంలో బీజేపీ పార్టీ వందరోజుల్లో వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు కాలయాపన చేస్తుంది అంటూ అందుకోసమే తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టినట్లు మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు.