మనకు మరో షాక్. ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా మనల్ని ముంచెత్తుతున్న ముప్పు ఇది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్ లో కొత్త రకం కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి.
వైరస్ పై ఉండే కొమ్ము భాగాల్లో మార్పులు చోటు చేసుకొని శరీరంలోకి ఈజీగా ప్రవేశిస్తున్నాయి. కరోనా వైరస్ కంటే రూపాంతరం చెందిన కొత్త వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. 70శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ఈ సమయంలో వైరస్ మళ్లీ టెన్షన్ పుట్టిస్తోంది. పలువురు విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం .
అక్కడేం జరుగుతోంది ?
బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ గుర్తించింది. ఇప్పటికే భారత్ దీనికి సంబంధించి అప్రమత్తం అయింది. యూకే నుంచి రానున్న ఫ్లైట్స్ నిలిపివేసింది. ఈ నిలిపివేత ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. అంతకన్నా ముందు యూకే నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు భారత విమానాశ్రయాలలో కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. అయితే యూకే నుంచి రానున్న విమానాలను జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్ ల్యాండ్, బల్జీరియా తదితర దేశాలు నిలిపివేశాయి. ఈ జాబితాలో భారత్ కూడా చేరింది.
హైదరాబాద్ లో ఏం జరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కొత్త రకం వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను వైద్య శాఖ ట్రాక్ చేయనుంది. ఎయిర్ పోర్ట్ లో కరోనా సర్వేలెన్స్ చేస్తూ అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళను ఆస్పత్రులకు తరలించనుండగా నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్ లో ఉండేలాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీళ్లకు కాంటాక్ట్లోకి వచ్చిన వారి విషయంలో టెన్షన్ పుడుతోంది .