సినీ నటుడు కమలహాసన్ గత పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిన పెద్దగా సత్తా చాట లేదు. అయితే త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయం సాధించాలని పొత్తులతో సరి కొత్త ఎత్తుగడలతో కమల్ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఎంఐఎం పార్టీ తో పొత్తు పెట్టుకున్న కమల్ రజినీ సిద్ధాంతాలు బాగుంటే ఆయన ముందుకు వస్తే కలసి పని చేయడానికి రెడీ అంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చారు.
ఇటువంటి తరుణంలో కమల్ హాసన్ పై తమిళనాడు సీఎం పళని స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమల్ సినిమాలు సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడేవి కాదని వాటి వల్ల సమాజానికి అనర్థం తప్పా పెద్ద ప్రయోజనం లేదని మండిపడ్డారు. 70ఏళ్ల వయసులో కూడా కమల్ హాసన్ నటిస్తున్నారని బిగ్ బాస్ హౌస్ లో సమాజానికి ఉపయోగపడే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు.
ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావటం వల్ల ఉపయోగం ఏముంటుందని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల దేశానికి చెడ్డపేరు మాత్రమే కాక కుటుంబాలు పాడైపోతాయి అని చెప్పుకొచ్చారు. దీంతో పళనిస్వామి చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.