పంజాబ్ లో గోడలపై వెలిసిన ఒక వాల్ పోస్టర్ కలకలం రేపింది.పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ని చంపేస్తే పదిలక్షల రూపాయల రివార్డిస్తామంటూ ఆ వాల్ పోస్టర్లో ఉంది.అంతేగాక ఆ వాల్ పోస్టరు మీద ఒక ఈ మెయిల్ ఐడీని కూడా ముద్రించారు.పోలీసులు దీనిని బరితెగింపు చర్యగా భావిస్తున్నారు.
ఈమెయిల్ అడ్రస్ తో కూడిన వాల్ పోస్టర్!
వివరాల్లోకి వెళితే … ‘సీఎంను చంపితే పది లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాం’.. అంటూ పంజాబ్లో శనివారం ఓ పోస్టర్ ప్రత్యక్షమయింది. దాంతో పంజాబ్లో ఈ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. మొహాలిలోని సెక్టార్ 66, 67లోని ఓ గోడపై ఈ పోస్టర్ వెలిసింది. అది చూసిన కొంతమంది యువకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ పోస్ట్ వైరల్గా మారడంతో.. పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే పోలీసులు పోస్టర్ ఉన్న ప్రాంతానికి వచ్చి పోస్టర్ను తీసేశారు. ఆ పోస్టర్పై [email protected] అనే మెయిల్ ఐడీ ఉంది. దాంతో పోలీసులు ఆ మెయిల్ ఐడీ ద్వారా నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. పోస్టర్ వెలసిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.‘ముఖ్యమంత్రిని చంపితే పది లక్షల రివార్డు ఇస్తాం అని ఉన్న పోస్టర్ను మేం స్వాధీనం చేసుకున్నాం. నిందితులపై ఐపీసీ సెక్షన్ 504, 506, 120 బీ సెక్షన్ల కింద ఫేస్ 11 పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేశాం.
ఆ పోస్టర్ పై ఉన్న ఈమెయిల్ ఐడీ ద్వారా నిందితులను త్వరలోనే పట్టుకుంటాం’ అని పోలీసులు వెల్లడించారు.ఇది ఎవరి పని అన్నది తేలాల్సి ఉంది.ప్రస్తుతం రైతు ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా సాగుతుండగా దాని ప్రభావం పంజాబ్ మీద అధికంగా ఉంది.ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే దాదాపు ఐదువందల సెల్ఫోన్ టవర్లు ధ్వంసం చేసిన సంఘటనలు జరిగాయి.ముఖ్యంగా జియో కంపెనీకి చెందిన సెల్ఫోన్ టవర్లు పొలాల్లో ఉండగా వాటిని రైతులు ధ్వంసం చేయటం తెలిసిందే.ఈ పోస్టర్ వెనుక కూడా రైతుల మద్దతుదారులు ఎవరన్నా ఉన్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది కాగా.. గతేడాది డిసెంబర్ 14న మెహాలిలోని బలోంగి-కుంభ రహదారిపై ఏర్పాటు చేసిన హోర్డింగ్లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ముఖంపై నల్లటి సిరాను చల్లారు.ఈ సంఘటనలన్నింటినీ క్రోడీకరించిన పోలీసులు అతి లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?