**స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా కదలడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క వార్త స్టాక్ మార్కెట్ ను కూడా చేయొచ్చు…. అలాంటి వారిపై సోమవారం ఇన్వెస్టర్ల పై పిడుగుపాటుకు గురి చేసింది.. రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఏకంగా పెట్టుబడిదారుల ఏడు లక్షల కోట్ల రూపాయల సంపద స్టాక్ మార్కెట్ ఒకే ఒక వార్తతో కోల్పోయింది. నిన్న మొన్నటి వరకు జోరుగా వెళ్లి స్టాక్ మార్కెట్ సోమవారం కుదేలైంది. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన మార్కెట్ క్రమంగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది.
** సోమవారం మార్కెట్ ఆశావహంగా ఉంటుంది. ఫ్రెష్ మైండ్ తో ఉండే పెట్టుబడిదారులు ఎక్కువగా కంపెనీల స్టాక్స్ కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈ సోమవారం మాత్రం పెట్టుబడిదారులకు చీకటి సోమవారం గా మిగిలిపోయింది. ఒక చిన్న వార్త స్టాక్మార్కెట్ మొత్తాన్ని విచ్చిన్నాం చేసింది.
** బ్రిటన్లో కరోనా లో కొత్త వైరస్ వెలుగు చూసింది. కరోనా కంటే త్వరగా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా లండన్ ను పూర్తిగా లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు, బ్రిటన్లోనూ లాక్డౌన్ ఆంక్షలు అమలు అవుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించడం స్టాక్ మార్కెట్కు పెద్ద అంశం అయ్యింది. దీంతో పాటు మధ్యాహ్నం భారత్ బ్రిటన్ కు డిసెంబర్ 31 వరకు ఎలాంటి ఫ్లైట్లు నడపడం లేదని ప్రకటించడం, స్టాక్ మార్కెట్ ను పూర్తిగా నష్టాల్లోకి తోసేసింది.
** మధ్యాహ్నం ఒంటిగంట వరకు కేవలం 400 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ భారత ప్రభుత్వ ప్రకటనతో ఒకేసారి 14 వందల పాయింట్లకు పైగా నష్టపోయింది. గత ఏడాది కాలంలో అత్యధిక నష్టం సోమవారమే నమోదయింది. ఆల్ టైం గరిష్టంగా ఉన్న సెన్సెక్స్ ముక్కే ఒక వార్తతో మొత్తం పడిపోవడం వధూవరుల ఏడు లక్షల కోట్ల రూపాయలు నష్టపోవడం చీకటి సోమవారం మిగిలిపోయింది.