విజయవాడ: పాకిస్థాన్కు సమాచారం ఇస్తోన్న తూర్పు నావికాదళానికి చెందిన ఏడుగురు సిబ్బందిని ఇంటలిజెన్స్ అధికారులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. నేవీకి చెందిన కీలక సమాచారాన్ని పాక్కు రహస్యంగా పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. పాక్ హవాలా వ్యాపారులతోనూ సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశారు. కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు, ఏపీ ఇంటిలిజెన్స్ శాఖ సమన్వయంతో చేసిన దర్యాప్తులో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు .. వీరందర్నీ విజయవాడ కోర్టుకు తరలించారు.
మరోవైపు ఈ సంబంధాలు కేవలం హవాలా వరకేనా..లేక రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు ఏమైనా చేరవేశారా అన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.