జాతీయ రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. రోడ్డు నియమాలు పాటించకుండా అతివేగంగా వాహనాలను నడుపుతుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోతున్నాయి.
హైదరాబాద్ ప్రాంతంలో ఆదివారం వేకువ జామున జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడి కక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు మాదాపూర్ అయ్యప్ప నగర్ కు చెందిన సంతోష్ (25), మనోహర్ (22), భరద్వాజ్ (20), రోషన్, పవన్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారి పై జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఒక మేక కూడా అక్కడి కక్కడే మృతి చెందింది.