Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో ‘డుంకీ’ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా సౌదీ అరేబియాలో జరుగుతోంది. కాగా తాజాగా అక్కడ షూటింగ్ ముగియడంతో షారుఖ్ అదే ప్రాంతంలో ఉన్న పవిత్ర ‘మక్కా’ నగరాన్ని సందర్శించాడు. హజ్ యాత్ర కాకుండా సంవత్సరంలో ఏ సమయంలోనైనా చేసే యాత్రను ఉమ్రా అంటారు. ఆ యాత్రను ఇప్పుడు షారుఖ్ ఖాన్ చేసినట్లు అయింది. ఈ స్టార్ హీరో మక్కాలో భక్తి శ్రద్ధలతో ఉమ్రా యాత్ర చేయగా.. ఆ విషయం తాజాగా అందరికీ తెలిసింది.
Shah Rukh Khan: ట్వీట్ వైరల్
కొద్ది గంటల క్రితమే ఒక జర్నలిస్ట్ షారుఖ్ ఖాన్ మక్కాలో సంప్రదాయ వస్త్రాలలో భక్తిలో మునిగి తేలుతున్న ఫొటోలను షేర్ చేశారు. ‘‘బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ నేడు మక్కాలో ఉమ్రా యాత్ర చేశారు. అల్లాహ్ అతని ఉమ్రాను అంగీకరించాలి, ఆమీన్!’’ అని ఆ జర్నలిస్ట్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్త వైరల్గా మారడంతో మిగతా సోషల్ మీడియా సైట్స్లో కూడా ఈ ఫొటోలు వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ డుంకి మూవీ షూట్ షెడ్యూల్ను ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఫినిష్ చేసేందుకు సహకరించినందుకు గానూ సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, టీమ్, అందరికీ థాంక్స్ చెప్పాడు. అందుకోసం ఓ వీడియోని కూడా షేర్ చేశాడు.
ఫ్యాన్స్ ఫిదా
ఉమ్రా యాత్ర చేస్తున్న షారుఖ్ ఫొటోలు కాస్త వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఇది కూడా కాస్త గందరగోళానికి గురవుతున్నారు. తర్వాత ఉమ్రా యాత్ర చేశాడని తెలిసి షారుఖ్ దేవుని పట్ల ఉన్న భక్తికి ఫిదా అవుతున్నారు.