భారత క్రికెట్ ఆటగాళ్లను పాక్ క్రికెట్ ఆటగాళ్లు ఎప్పుడూ ఏదో ఒక విషయంపై చులకన భావంతో మాటలు అంటూనే ఉంటారు. నోటికి ఏది తోస్తే అది అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా వారు భారత ఆటగాళ్లపై వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా సరిగ్గా అలాగే నీచమైన వ్యాఖ్యలు చేశాడు.
భారత్, ఆస్ట్రేలియా జట్లతో ఆడడాన్ని తాను ఎంతగానో ఇష్టపడతానని అఫ్రిది అన్నాడు. భారత్పై పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించే రోజుల్లో భారత్ ఓడిపోగానే ఆ జట్టు సభ్యులు వచ్చి తమను క్షమించాల్సిందిగా కోరే వారని.. అఫ్రిది అన్నాడు. ఈ మేరకు అఫ్రిది తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చి్న ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయగా వాటిపై దుమారం చెలరేగుతోంది.
ఇక తన క్రికెట్ కెరీర్ మొత్తంలో భారత్పై చెన్నై టెస్టులో చేసిన శతకం తనకు చాలా ప్రత్యేకమైందని అఫ్రిది అన్నాడు. ఆ టెస్టులో 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో తమ జట్టు ఉంటే తాను 141 పరుగులు చేయడం తనకు ఇప్పటికీ ప్రత్యేకమేనని తెలిపాడు.