Shakunthalam: గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా శాకుంతలం.. తన కెరియర్లో సమంత మొదటిసారిగా పౌరాణిక పాత్రలో కావ్యా నాయకి గా నటిస్తోంది.. ఈ చిత్రంలో దుష్యంతుడి గా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. తాజాగా సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది..
ఈ సినిమాలో శకుంతల కొడుకు పాత్ర ఉంటుందట. ఈ కొడుకు పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభిరామ్ ను, లేదంటే అల్లు అర్జున్ కొడుకు అయాన్ లలో ఒకరిని తీసుకునే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నట్లు తాజా సమాచారం.. వీరిద్దరిలో ఎవరు నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ సినిమా ద్వారా పరిచయం చేయనున్నారు గుణశేఖర్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవ్వడానికి ఈ చిత్రం సరైనది అనడంలో సందేహం లేదు..మొత్తానికి ఈ సినిమా ద్వారా ఒక స్టార్ హీరో కిడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమవనున్నారు.. మరి ఈ స్టార్ కిడ్స్ లో ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.