ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ టిడిపి నేత, రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల రవీంద్ర పరిటాల రవి కి చెందిన కొన్ని ఫ్లెక్సీలను ఆదివారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు. దీంతో పరిటాల రవి అభిమానులు, అనుచరులు ఈ విషయం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే…. కదిరి దేవరపల్లి గ్రామం అనంతపురంలో పరిటాల రవి కి సంబంధించి కొన్ని ఫ్లెక్సీలను అతని వర్ధంతి సందర్భంగా టిడిపి అభిమానులు ఏర్పాటు చేశారు. పరిటాల రవి చనిపోయిన నేటికీ 16 సంవత్సరాలు అయింది. అయితే ఉదయం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను కాల్చి వేయడం జరిగింది. దీంతో టిడిపి కార్యకర్తలు, పరిటాల అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కావాలనే విరోధలు ఈ పనిచేశారని టిడిపి కార్యకర్తలు ఆరోపించారు. ఇక ఈ రోజున పరిటాల రవి భార్య, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత అతని కొడుకు, టిడిపి నేత పరిటాల శ్రీరామ్ వెంకటాపురం దగ్గర్లోని పరిటాల ఘాట్ కు విచ్చేశారు. ప్రముఖ టీడీపీ రవి కి తమ నివాళులు అర్పించారు. ఈ రోజున పరిటాల ఘాట్ నిండా పూలతో అలంకరించారు. అంతేకాకుండా ఘాట్ వద్ద పరిటాల రవి ఫోటోలను ఉంచారు
ఇక తన భర్త కు నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన టిడిపి మహిళా నేత పరిటాల సునీత తన భర్త ఆశయాలను నెరవేర్చేందుకే తను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. అతని ఆశయాల్ని ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తాను అని చెప్పిన ఆమె… అతని వర్ధంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.