Bigg Boss 5 Telugu: ఐదో వారం నామినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ పేరు డబల్ త్రిబుల్ గా వినబడుతోంది. సోషల్ మీడియాలో యూట్యూబ్ స్టార్ గా షణ్ముఖ్ జస్వంత్ కి… మంచి క్రేజ్ ఉంది. దీంతో మనోడు హౌస్ లో అడుగు పెట్టగానే… అంచనాలు బీభత్సంగా పెరిగిపోయాయి. అయితే ప్రారంభంలో చాలా కన్ఫ్యూజన్ గా అంటూనే మరో పక్క ఇతర ఇంటి సభ్యులు అక్క ఆటతీరును ఒక కంట కనిపెడుతూ.. గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో వీకెండ్ ఎపిసోడ్ లో ఒక రోజు గేమ్ స్టార్ట్ చెయ్ .. షన్ను అని నాగార్జున చేత చెప్పించుకోవడం కూడా జరిగింది. అయినాగానీ స్లో అండ్ స్టడీ అన్న తరహాలో.. దాదాపు నాలుగు వారాలపాటు గేమ్ ఆడిన షణ్ముఖ్ జస్వంత్ వారంలో నామినేషన్ ప్రక్రియ అనంతరం.. సరి కొత్త అవతారమెత్తాడు.
ఏకంగా ఇంటిలో ఉన్న సభ్యులంతా ముఖ్యంగా మగవాళ్ళు.. తనకి ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఎక్కువ ఓట్లు వేయడంతో ఎవరి ఆట ఏంటో నాకు అర్థమైందని.. ఇకనుండి గేమ్ స్టార్ట్ చేస్తానంటూ.. తనదైన శైలిలో ప్రస్తుతం హౌస్ లో రాణిస్తున్నాడు. సిరి, జెస్సీ లతో మాత్రమే క్లోజ్ గా ఉంటున్న షణ్ముఖ్ జస్వంత్.. ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ తరుణంలో హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్ గా రాణిస్తున్న శ్రీరామ్ చంద్ర తో గొడవ కూడా వేసుకోవడం జరిగింది. జెస్సీ కి ఫుడ్.. అదే రీతిలో డ్యూటీ విషయంలో… కిచెన్ వద్ద శ్రీరామ్ తో.. గొడవ అయిన క్రమంలో షణ్ముఖ్ జస్వంత్ ఎంటర్ అయ్యి కెప్టెన్ పై కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఏకంగా ఫుడ్ పెట్టాను అని శ్రీరామ్ డైలాగ్లు వేయడంతో.. షణ్ముఖ్ జస్వంత్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
సిరి సాయంతో యాంకర్ రవి ని దెబ్బకొట్టడానికి
పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో లో ఫేస్ బుక్ జశ్వంత్ ని గట్టిగా టార్గెట్ చేసిన వారిలో యాంకర్ రవి ఉన్నారన్న సంగతి తెలిసిందే. హర్ష్ గా మాట్లాడకూడదు.. అంటూ కూడా మొన్న రవి.. షణు కి వార్నింగ్ ఇచ్చారు. ఈ టైంలో రవికి మాటకి మాట షణ్ముక్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రస్తుతం ఈ రాజ్యానికి రాజు ఒక్కడే అనే టాస్క్ బిగ్ బాస్ ఇవ్వటం తెలిసిందే. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లో సన్నీ అదేరీతిలో రవి ఇద్దరిని రాజులుగా బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది. వీరిద్దరి సామ్రాజ్యాల నడుమ ప్రజలు.. నాణేలు సంపాదించుకోవాలి. ఈ తరుణంలో షణ్ముఖ్ జస్వంత్… తనకి హౌస్ లో అత్యంత క్లోజ్ అయినా సిరి..నీ.. సైలెంట్ గా రవి రాజ్యంలోకి దింపటం జరిగింది.
రవి నిధుల ఖజానాలో నుండి నాణాలు దోచుకోవడం..!!
ఆ రాజ్యం లోనే ఉండే సిరి… రవి నిధుల ఖజానాలో నుండి నాణాలు దోచుకుంటూ… గేమ్ ఆడుతూ ఉంది. ఒక విధంగా చూసుకుంటే రవి సామ్రాజ్యంలోనే ఉండి అతనికి వెన్నుపోటు పొడిచే రీతిలో.. షణ్ముఖ్ జస్వంత్ సిరి చేత గేమ్ ప్లే చేస్తున్నాడు. ఎవరి దగ్గర నాణలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు… కెప్టెన్సీ కోసం పోటీ పడవచ్చు. ఈ తరుణంలో రవి దగ్గరే శిరిడి పెట్టి అతని నాణాలు మొత్తం.. కొండగట్టు అలా రవి కెప్టెన్సీ పోటీలో కి రాకుండా చేసేలా షణ్ముఖ్ జస్వంత్ సరికొత్త ప్లాన్ వేయటం జరిగింది. మరి ఈ ప్లాన్ చివరి వరకు వర్కవుట్ అవుతుందో లేదో.. చూడాలి.