శంకర్.. జెంటిల్ మాన్ సినిమాతో దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకోవడంతో పాటు దర్శకుడిగా శంకర్ కి గొప్ప పేరు తీసుకు వచ్చింది. సామాజిక అంశానికి కమర్షియల్ అంశాలు జోడించి తీసిన ఈ సినిమా భారీ కమర్షియల్ సక్సస్ ను అందుకుంది.
అంతే శంకర్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. మొత్తం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ దర్శకుల లిస్ట్ లో శంకర్ పేరు చేరింది. శంకర్ తీసే ప్రతీ సినిమా ఒక విజువల్ వండర్ అనిపిస్తుంది. జెంటిల్ మాన్, భారతీయుడు, ప్రేమికుడు, ఒకే ఒక్కడు.. లాంటి వరస బ్లాక్ బస్టర్స్ తో అద్భుతమైన సక్సస్ లను అందుకోవడమే కాదు అతి కొద్దికాలంలోనే ఇండియన్ జేమ్స్ కేమరూన్ అన్న గొప్ప పేరు సంపాదించుకున్నాడు.
అయితే ప్రస్తుతం శంకర్ కి కూడా బ్యాడ్ టైం నడుస్తోంది. శంకర్ సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి శంకర్ కూడా సీక్వెల్స్ తీయడం కాస్త ప్రేక్షకులకి డిసప్పాయింట్మెంట్ గా భావిస్తున్నారట. మద్యలో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతా సినిమాలన్ని కొత్త కథతో తెరకెక్కి భారీ సక్సస్ లు అందుకున్న స్ట్రెయిట్ సినిమాలనే శంకర్ రూపొందించాడు. కాబట్టే శంకర్ కి ఇంతగొప్ప పేరు దక్కిందని చెప్పాలి. ప్రతీ సినిమాతో ఒక కొత్త రికార్డ్ క్రియోట్ చేశాడు శంకర్.
కాగా భారీ హిట్ అందుకున్న “రోబో” కు సీక్వెల్ అనౌన్స్ చెయ్యడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కాని రోబో సీక్వెల్ షాకిచ్చింది. అయినా శంకర్ కెరీర్ లో ఎంతో గొప్పగా చెప్పుకునే లోకనాయకుడు కమల్ తో తీసిన “భారతీయుడు”కు సీక్వెల్ ను ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా మీస భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తాజాగా శంకర్ మొదటి సినిమా “జెంటిల్ మెన్” కు కూడా సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు అధీకారక ప్రకటన వెలువడింది.
అయితే శంకర్ లాంటి దర్శకులు ఇలా సీక్వెల్ తీస్తే కొత్త కథ లు ఎలా వస్తాయన్న టాక్ మొదలైంది. ఇది కొంతమంది మాట్లాడుకుంటుంటే కొంతమంది మాత్రం ఇలా వరసగా బ్లాక్ బస్టర్స్ కి సీక్వెల్స్ ని అనౌన్స్ చేయడం హ్యాపీగా ఫీలవుతున్నారు. ఏదేమైనా శంకర్ తెరకెక్కించే భారతీయుడు సీక్వెల్ మీదే ఆయన కెరీర్ ఆధారపడి ఉందని చెప్పుకుంటున్నారు.