Vijay: కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను అధికారికం గానూ ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొంద నుండగా త్వరలో సెట్స్ మీదకు రాబోతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇందులో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ మూవీ విజయ్కు తెలుగులో స్ట్రైట్ మూవీ కావడం విశేషం.
- Read latest news in NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews subscribe our channel
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్కు తండ్రిగా ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ను దిల్ రాజు బృందం ఎంపిక చేశారని తెలుస్తోంది. నటుడిగా ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే శరత్ కుమార్ తెలుగులో బన్నీ లాంటి సూపర్ హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రేజ్ వల్లే ఇప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన శరత్ కుమార్ను విజయ్ – వంశీ పైడిపల్లి సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నారట.
Vijay: వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా..
తమిళంలో విజయ్ – శరత్ కుమార్ కాంబోకు మంచి క్రేజ్ ఉంది. ఇక ఇక్కడ కూడా ఇదే కాంబో కు మంచి క్రేజ్ వస్తుందనే ఆయనను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లాంఛింగ్ కార్యక్రమం లో కూడా శరత్ కుమార్ కనిపించారు. ఇక ఇటీవల విజయ్ హీరోగా బీస్ట్ సినిమా వచ్చింది. ఫ్లాప్ టాక్ ఉన్నా కూడా తమిళంలో రూ 100 కోట్ల మార్క్ దాటేసింది. మరి తెలుగు లో ఆయన నటిస్తున్న ఈ మొదటి సినిమాపై అంచనాలు బాగానే ఉన్నా ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో అనేదే పలువురిలో కలుగుతున్న సందేహాలు. ఇక అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారట.