యోగాగురు బాబా రామ్ దేవ్ యాజమాన్యంలో నడుస్తున్న ఒక కంపెనీ తమ ఉత్పత్తుల ద్వారా ఆర్జిస్తున్న లాభాలలో స్థానిక రైతులకు వాటా పంచాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఈ తరహా ఆదేశాలు కోర్టు నుంచి రావడం ఇండిాయాలో బహుశా ఇద్ ప్రధమం. కంపెనీ లాభాలలో రైతులకు వాటా పంచాలన్న ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డు ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన రామ్దేవ్ బాబా కంపెనీ దివ్య ఫార్మసీకి చుక్కెదురైంది. ఫార్మసీ పిటిషన్ ను కొట్టివేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు బయోలాజికల్ డైవర్సిటీ చట్టం-2002ను సమర్ధించింది. ఆయుర్వేద ఔషధాల తయారీలో అత్యంత ముఖ్యమైన ముడిసరుకు ఉత్పత్తి దారులకు కంపెనీ లాభాలలో వాటా పంచాల్సిందేనని స్పష్టం చేసింది.లాభాలలో వాటాను స్థానిక రైతులకు పంచాలన్న ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డు గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టులో సవాల్ చేసింది. దివ్యా ఫార్మసీ కంపెనీకి కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. కంపెనీ లాభాలు 421 కోట్ల రూపాయలలో రైతులకు రూ. 2 కోట్లు పంచాల్సిందేనని స్పష్టం చేసింది.
previous post
next post