Ys Jagan Mohan Reddy : జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ అప్పట్లో వైయస్ షర్మిల దేశంలో ఏ మహిళా చేయని విధంగా దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అందరికీ తెలిసిందే. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ నిలబెట్టడంలో మాత్రమే కాక పార్టీ చెక్కుచెదరకుండా మహిళా అయినాగాని రాజకీయ అనుభవం లేకపోయినా గాని ముందుండి నడిపించడం జరిగింది. అంతమాత్రమే కాకుండా పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కీలకంగా షర్మిల రాణించడం జరిగింది. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అవడం కోసం 2019 ఎన్నికల ప్రచారంలో కీలకంగా రాణించి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వరకు ఇంటికే పరిమితం అయింది.
Ys Jagan Mohan Reddy : జగన్ ప్లాన్ ప్రకారం :-
ఇలాంటి తరుణంలో తాజాగా హఠాత్తుగా తెలంగాణలో పార్టీ పెట్టడానికి షర్మిల ముందుకు రావడానికి గల కారణం జగనే అన్న వాదన తెలుగు రాజకీయాల్లో వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి తాను కృషి చేస్తున్నట్లు కిందిస్థాయి కార్యకర్తల తో మంతనాలు జరిపి భవిష్యత్తు ప్రకటనకు రెడీ అవుతున్నట్లు షర్మిల మీడియా కి తెలపడం అందరికీ తెలిసిందే. ఇంత హఠాత్తుగా షర్మిల అదీ తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది జగన్ యొక్క స్ట్రాటజీ అనే టాక్ వస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ క్రమేణా తగ్గుతూ ఉన్న క్రమంలో.. ఆ పార్టీకి చెందిన నాయకులు మరియు ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్ళుతుంది తరుణంలో జగన్ ముందుజాగ్రత్త తీసుకున్నట్లు, అందువల్ల జగన్ వెనకుండి షర్మిల ని రంగంలోకి దింపుతున్న ట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
ఓటు వేరే వైపు వెళ్లకుండా:-
టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రమే కాక కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా గల్లంతు అవుతున్న తరుణంలో .. బిజెపి వైపు వెళ్లే అవకాశాలు మెండుగా ఉండటంతో ఏమాత్రం తెలంగాణలో బిజెపి వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని.. విభజన చట్టంలో ప్రకారం సరైన పంపకాలు లేని తరుణంలో అది మొత్తానికి తన భవిష్యత్తు కి పెద్ద డ్యామేజ్ చేసే అవకాశం ఉండటంతో షర్మిల చేత జగన్ ఏ పార్టీ పెట్టించి .. కాంగ్రెస్ ఓటుబ్యాంకు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు కమలం పార్టీ వైపు వెళ్లకుండా సరికొత్త ఎత్తుగడ వేసినట్లు, మళ్లీ బాణాన్ని తెలంగాణ రాజకీయాల్లో వదిలినట్లు సీనియర్లు చెప్పుకొస్తున్నారు.