ప్రతి ఆదివారం ‘కొత్తపలుకు’ పేరిట ఒక టీడీపీ అనుకూల పత్రిక యజమాని తన పత్రికలో రాసే వ్యాసాలు ఎంతో సంచలనం సృష్టిస్తుంటాయి. అవి కొన్నిసార్లు ఎటువంటి అర్థం లేకుండా … ఎలాంటి ప్రూఫ్ లేకుండా కూడా ఉంటాయి. అయినా కూడా అతను తెలుగుదేశం పార్టీని హైలెట్ చేయడానికి ఎలాంటి రాతలైనా రాస్తారు. ఇక ముఖ్యంగా అందులో ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ అతని వ్యాసాలు ఉంటాయి. ఇక ఈ వారం కాస్త వెరైటీగా జగన్ చెల్లెలు షర్మిల ను టార్గెట్ చేసి ఒక అద్భుతమైన కథను అల్లారు.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతోంది అని…. అందుకు రంగం సిద్దం అయిందని రాసుకొచ్చారు. ఏపీలో వైసీపీ పార్టీ ఉంది…. అయితే అది తెలంగాణలో జగన్ కంటిన్యూ చేయలేదు. తన పూర్తి ఫోకస్ ఆంధ్రప్రదేశ్ పైనే పెట్టారు. మరి అసలు షర్మిల కొత్త పార్టీ ఎందుకు పెడుతుంది…? ఆమెకు అన్న జగన్ తో ఏమన్నా విభేదాలు ఉన్నాయా? అని ఈ వ్యాసం బయటకు వచ్చిన తర్వాత అనేక ఊహాగానాలు వినిపించాయి.
ఇక దీన్ని నమ్మి ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నేరుగా జగన్ తమ చెల్లెలు షర్మిల ను రాజకీయంగా తొక్కేశారు అని…. విశాఖ ఎంపీ సీటు ఆమెకు ఇవ్వలేదని అందుకే ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెడుతోందని విమర్శించారు. ఇక తెలంగాణ కంటే ఏపీలో అన్నకు వ్యతిరేకంగా పార్టీ పెట్టడం ఖాయమని ఆయన అన్న మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ రచయిత గురించి తెలుసుకున్న జగన్ చెల్లెలు షర్మిల అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
రెండు రాష్ట్రాలను షేక్ చేసిన ఈ వార్తలపై స్పందించిన షర్మిల ఇలాంటి తప్పుడు వార్తలు రాసే పత్రిక పైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని హెచ్చరించింది. ఒక పత్రికా ప్రకటన ద్వారా తాను పార్టీ పెట్టబోతున్నట్లు బయటకు వచ్చిన కథనం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని… ఇది వైయస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతో రాశారని ఆరోపించింది. ఈ కథను పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పిన షర్మిల ఏ పత్రిక అయినా ఛానల్ అయినా కుటుంబ విషయాలను అసలు ప్రస్తావించడమే తప్పు అని విమర్శించింది. దీనిని ఒక నీతి మాలిన చర్యగా వర్ణించింది.