ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల అంశం రాజకీయ రంగాన్ని పూర్తిగా వేడెక్కించింది అనే చెప్పాలి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ వైసీపీ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రైస్తవ మతాన్ని టార్గెట్ చేస్తూ అనేకమంది విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుతం తాజాగా మతాల మధ్య చిచ్చు రేగేలా గతంలో వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్ అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక ఏడాది క్రితం పోస్ట్ అయిన వీడియో కి సంబంధించి పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతుండడం గమనార్హం. ఇక ఈ కేసులో చిక్కుకున్న వ్యక్తికి…. వైసిపికి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ తో పోలీసుల అదుపు లో ఉన్న పాస్టర్ ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నాయని టిడిపి నేత, మాజీ హోం మంత్రి చినరాజప్ప అనుమానం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు చిన్న రాజప్ప. ఆయన మాటలు పెద్దగా ఎవరూ పట్టించుకోకపోయినా వైసీపీని కేంద్రంగా చేసి అతను ఆరోపణలు చేయడం పెద్ద దుమారం రేపింది. ఇక ఇదే సమయంలో బ్రదర్ అనిల్ కుమార్ భార్య షర్మిల విఈ షయంపై కొద్దిగా కంగారు పడినట్లు వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది.అందుకే ఆమె వీలైనంత త్వరగా తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఈ విషయంపై ధైర్యం కోరే విషయమై ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూద్దాం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?