Sharmilla : గత కొన్ని రోజుల నుండి ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల Sharmilla తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుగు రాజకీయాల్లో వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా రకరకాల కథనాలు ప్రచారం చేస్తూ జగన్ నీ కార్నర్ చేస్తూ అనేక వార్తలు రాయడం జరిగింది. ఇలాంటి తరుణంలో వేరుగా షర్మిల వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అలా వార్తలు ప్రసారం చేసిన మీడియా ఛానల్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.
ఇంత క్లారిటీగా షర్మిల చెప్పిన గాని మాజీ లోక్సభ నాయకుడు సబ్బంహరి లేదు లేదు ఖచ్చితంగా షర్మిల రాజకీయ పార్టీ పెట్టడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పటికే పార్టీని రిజిస్టర్ కూడా చేయించారు అని లాంఛనప్రాయంగా ప్రారంభించడానికి ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదే తరుణంలో వైయస్ జగన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చినట్లు సబ్బం హరి ఈ డిబేట్లో చెప్పుకొచ్చారు. అసలు షర్మిల ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తల్లి విజయమ్మ ఉందేమో అన్న భావన వస్తుందని చెప్పుకొచ్చారు. కొడుకు అధికారంలోకి వచ్చాక పార్టీలో షర్మిలకి సరైన స్థానం కల్పించకపోవడం వల్లే .. విజయమ్మ మనస్తాపానికి చెంది ..తల్లి కూతురు ఇద్దరు కలిసి కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారు ఏమో అన్న భావన కలుగుతోంది అన్నట్లు సబ్బం హరి.. ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ డిబేట్ లో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గతంలో షర్మిల కి పార్టీ తరుపున రాజ్యసభ స్థానం అధిష్టానం హామీ ఇచ్చినట్లు కానీ అధికారంలోకి వచ్చాక జగన్.. వాటన్నిటినీ పెడచెవిన పెట్టడంతో పరిస్థితి ఇక్కడిదాకా వచ్చినట్లు సబ్బం హరి చెప్పుకొచ్చారు.