Crime News: శిల్పాచౌదరి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎక్కువ వడ్డీకి ఇప్పిస్తాను అంటూ కొందరు యాక్టర్స్తో పాటు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బిజినెల్మెన్ లను సైతం మోసం చేసింది. ఈమె సుమారుగా రూ.200 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్టు సమాచారం. అయితే బాధితులు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ప్రస్తుతం ఒకరి తర్వాత మరొకరు బయటకు వస్తూ.. మోసపోయామని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీరిలో కొందరు ప్రముఖుల పేర్లను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని టాక్.
దివ్య ఫిర్యాదుతో…
దివ్య అనే మహిళ కంప్లైంట్తో రంగంలోకి దిగిన పోలీసులు శిల్పతో పాటు ఆమె భర్తనూ అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అనంతరం వారిద్దరినీ విచారించారు. రియల్ ఎస్టేట్ పేరుతో చాలా మంది ప్రముఖులను, వ్యాపారులను శిల్ప మోసం చేసినట్టు వెల్లడించారు పోలీసులు. బాధితులు ఎవరికీ భయపడకుండా ముందుకు వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఒక్కొక్కరుగా బయటకు..
శిల్పచౌదరి బాధితుల్లో ఒక్కొక్కరు బయటకు వస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్బాబు సిస్టర్, హీరో సుధీర్బాబు వైఫ్ ప్రియదర్శిని పోలీసులను ఆశ్రయించింది. శిల్ప మోసం చేసినట్టు ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఇంకా చాలా మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయని కానీ పోలీసులు వారి పేర్లను బయటపెట్టడం లేదని టాక్. వీరికి తోడు ఓ యంగ్ హీరో హర్ష కుటుంబాన్ని సైతం మోసం చేసిందట. కిట్టిపార్టీ పేరుతో తన వద్ద రూ.3కోట్లు శిల్ప వసూలు చేసినట్టు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా స్పందించడం లేదని అతడు చెప్పినట్టు సమాచారం. ఇక ఈ చీటింగ్ లో శిల్ప, ఆమె భర్త మాత్రమేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ మోసం వెనకాల ఇంకెవరున్నారనేది తొందరలోనే బయటపడనుంది. చూడాలి మరి ఎవరి పేర్లు తెరపైకి వస్తాయో.