29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

షిర్డీ – కాకినాడ ఎక్స్ ప్రెస్ రైలులో దోపిడీ దొంగల స్వైర విహారం.. 30 మంది మహిళల మెడలో బంగారు అభరణాలు చోరీ

Share

షిర్డీ – కాకినాడ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. షిర్డీ నుండి కాకినాడ బయలుదేరిన ఎక్స్ ప్రెస్ రైలు సిగ్నల్ కోసం మహారాష్ట్రలోని పర్బణి స్టేషన్ సమీపంలో ఆగింది. ఇదే అదునుగా దోపీడీ దొంగలు బోగీలోకి ప్రవేశించారు. మహిళా ప్రయాణీకులను బెదరించి వారి మెడలోని గొలుసులు లాగేసుకున్నారు. ఎస్ 2 నుండి ఎస్ 11 బోగీ వరకూ మహిళలే టార్గెట్ గా దోపిడీ చేశారు. దాదాపు 30 మంది ప్రయాణీకుల నుండి బంగారం దోచుకువెళ్లారు.

Shirdi Kakinada Express Robbery Parbhani Maharashtra

 

దీంతో బాధితులు లోబోదిబో మంటూ పర్బణి స్టేషన్ లో ఆర్‌పీఎఫ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇటువంటి ఘటనలు జరుగుతుండేవి. అయితే ఇటీవల కాలంలో రైళ్లలో దోపిడీ దొంగల స్వైర విహారం లేకపోవడంతో ప్రయాణీకులు నిర్బయంగా ప్రయాణాలు చేస్తున్నారు. తాజా ఘటనతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.

సీఎం సన్నిహిత నేతల నివాసాల్లో ఈడీ సోదాలు .. ఆ సీఎం స్పందన ఇదీ


Share

Related posts

Bigg Boss 5 Telugu: ఆ ఎలిమినేషన్ కరెక్ట్ కాదు..బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ షాకింగ్ కామెంట్స్..!!

sekhar

Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి చాలు..!!

bharani jella

దారుణం.. భార్యను ఏడాది నుంచి ‘బాత్రూమ్’లోనే పెట్టాడు.. చివరికి?

Teja