హైదరాబాద్లో ఉండే కొంతమంది జల్సారాయుళ్లకు , కొత్త ఆనందాలకు పొందాలనుకునే వారికి వీకెండ్స్ పట్ల ఎంతో క్రేజ్ ఉంటుంది. తమకు నచ్చిన టైం ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు పబ్బులకు వెళ్లిపోదామా అని ఆసక్తితో ఉంటుంటారు.
అయితే, వీరికి గత కొద్దికాలంగా పలు షాకులు ఎదురవుతున్నాయి. అయితే, తాజాగా దిమ్మతిరిగే షాక్ ఎదురైంది. గచ్చిబౌలి, మాదాపూర్ లలో జరిగిన డ్రంకెన్ డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.
పబ్బుల్లో ఏం జరిగిందో తెలుసా?
ఇటీవలే హైదరాబాద్లోని పలు పబ్బులకు పోలీసులు షాక్ ఇచ్చారు. పలు పబ్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ ల పై కొరడా ఝుళిపించారు. అర్ధరాత్రి వరకు పబ్బులు ఓపెన్ చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. నిబంధనలు బేఖాతరు చేస్తున్న పబ్ లను గుర్తించారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలను గుర్తించి కేసులు నమోదు చేసారు. అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్ ని తెచ్చిన పబ్ ల మీద కేసులు నమోదు చేసారు. కరోనా నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేస్తున్నట్టు గుర్తించారు. మాస్కులు ధరించకుండానే వచ్చినవారికి సర్వీస్ చేస్తున్న తీరుని గుర్తించారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పినట్టు పోలీసుల దృష్టికి రావడంతో వారి మీద చర్యలకు దిగారు.
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే…
అయితే, పబ్బుల కేంద్రంగా మరిన్ని ఘోరాలు జరుగుఉతన్నాయి. అక్కడ పూటుగా తాగిన వారితో ఘోర ప్రమాదాలు జరుగుతున్న. ఇటీవల రెండు ఘటనలు ఇదే కోణంలో జరిగాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రమాదాలు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం వల్లే జరిగాయని సజ్జనార్ పేర్కొన్నారు. ఇకపై మరింత కఠినంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులతో డ్రంకెన్ డ్రైవింగ్ కి ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక మీదట డ్రంకెన్ డ్రైవింగ్ లో దొరికితే..పదేళ్లు జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎక్కడో మద్యం తాగి సైబరాబాద్ లోని రోడ్లపైకి లాంగ్ డ్రైవ్ అంటూ వస్తున్నారని అన్నారు. అంతే కాక డ్రంకెన్ డ్రైవ్ లో పిల్లలు పట్టుబడగానే…మా వాడు ఇలా ఎప్పుడు చేయడు అంటూ చెప్పే పేరెంట్స్ ఎక్కువయ్యారని అన్నారు. ఇక పై పేరెంట్స్ నూ వదిలేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా పబ్బులలో మద్యం తాగి సైబరాబాద్ లో డ్రంకెన్ డ్రైవింగ్ లో పట్టుబడితే…ఆ కేసులో పబ్బు నిర్వాహకులను చేరుస్తామని అన్నారు. మద్యం తాగి పబ్బులోంచి బైటకు వచ్చే వారిని ఇంటికి చేర్చే బాధ్యత పబ్బు నిర్వాహకులదేనని, లేదా వారి సొంత వాహనాలకు పబ్బులే ప్రత్యామ్నాయ డ్రైవర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీసుల కీలక నిర్ణయం ఇటు జల్సా రాయుళ్లకు, అటు వాళ్ల తల్లిదండ్రులకు, పబ్బుల ఓనర్లకు షాక్ వంటిదని చెప్తున్నారు.