ఇటివల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు విజయసాయి రెడ్డి షోకాజ్ నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ అంశం ఎవరూ ఊహించని మలుపు తీసుకుంది. ‘అన్న వైఎస్సార్ పార్టీ’ నుంచి షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి విజయసాయి రెడ్డి ఎవరు అని ఓ చానెల్ లో ఆయన ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదొక పార్టీ ఉందా.. అని అందరినీ ఆశ్చర్యపరిచేలా ఈ పార్టీని తెర పైకి తెచ్చారు ఎంపీ.
ఈ పార్టీని స్థాపించింది కడప జిల్లాకు చెందిన మహబూబ్ భాషా. వైఎస్సార్ పార్టీ కంటే మూడు నెలల ముందే ఎన్నికల సంఘం వద్ద నేను నా పార్టీని రిజిస్టర్ చేయించానంటున్నారు. ఆయన కూడా లైవ్ లోకి వచ్చి.. తన పార్టీ పేరు మీద రఘురామకృష్ణ రాజుకు నోటీసు ఇవ్వడానికి నువ్వెవరు అంటూ విజయసాయి రెడ్డిన దూనమాడారు. ఇప్పటివరకూ వార్తల్లో లేని పార్టీని తెరపైకి తెచ్చి రఘురామకృష్ణ రాజు మరో చర్చకు దారి తీశారు.