కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలో ప్రకటించినట్లుగానే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది. ప్రస్తుత పరిణామాలు ఆయన ఒకింత ఇరుకున పడే సందర్భమే.
ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా బీజేపీ నేతలు కామెంట్లు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఏం చేయబోతున్నామో ప్రకటించారు.
తిరుమలలో ఏం జరిగింది?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిన సంగతి తెలిసిందే. టీటీడీకి చెందిన ఎస్వీబిసిలో శృంగార వెబ్ సైట్ లింక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఎస్వీబిసికి ఒక భక్తుడు మెయిల్ చేశాడు. అయితే తిరిగి భక్తుడికి ఓ యస్వీబిసి ఉద్యోగి పోర్న్ సైట్ లింక్ పంపించారు. దీంతో భక్తుడు టీటీడీ ఈవో సహా చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై తీవ్రంగా స్పందించిన ఈవో జవహర్ రెడ్డి టీటీడీ విజిలెన్స్ కి సమాచారం అందించారు. దీంతో ఎస్వీబిసి కార్యలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడిపి అధికారులు తనిఖిలు నిర్వహించారు. బూతు వీడియో పంపిన ఉద్యోగిని సస్పెండ్ చేసింది.
రాజకీయ రచ్చలో కొత్త కలకలం
టీటీడీకి చెందిన భక్తి ఛానల్లో బూతు వీడియోల పర్వం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీరియస్ అయ్యారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ ఛానల్లో ఫోర్న్ వీడియోలు చూడటం దారుణమని అన్నారు. ఎస్వీబీసీ ఉద్యోగులను తీసేయాలని డిమాండ్ చేశారు. ఆ ఛానల్ను ధర్మచార్యులకు అప్పగించాలని.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులో ధర్మచార్యులు సభ్యులుగా ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. సింహాచలం భూములను రాజధానికి వాడాలని చూస్తున్నారని..అలా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని సోము వీర్రాజు అన్నారు. టీటీడీ ధర్మరక్షణకు రూ.500 కోట్లు ఇవ్వాలని..టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ సరిగా లేదని ఫైర్ అయ్యారు.