హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాజకీయ పార్టీల మద్య విమర్శల పర్వం కొనసాగుతుండగా ఇంకో అంశం తెరమీదకు వచ్చింది. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నిబంధనల అమలుపై తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కరోనా జాగ్రత్తల సంగతి ఏంటి?
కరోనా మహమ్మారిపై హైకోర్టులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు తెరమీదకు వచ్చాయి. వ్యాక్సిన్ వచ్చే వరకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇప్పటికే ఐసిఎంఆర్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో అన్ని పార్టీలు జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకుంటున్నాయి. జీహెచ్ఎంసిలో కరోనా నిబంధనలపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసిలో మాస్క్ లు, భౌతిక దూరం వంటివి సరిగా అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా జాగ్రత్తలు, కరోనా అమలకు సంబంధించిన జీవో 64ను జీహెచ్ఎంసి కి అప్పగించడంపై హైకోర్ట్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. జీవో 64 అమలు విషయాన్ని పోలీసులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఐసిఎంఆర్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలనీ స్పష్టం చేసింది.
ఆయనపై ఆగ్రహం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజుకు 50వేలు, వారానికోసారి లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. అయితే రోజుకు 50 వేల పరీక్షలు అవసరం ఉన్నప్పుడు చేస్తామని నివేదికలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలియజేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు రోజుకు 50 వేలు, వారానికో రోజు లక్ష కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి మరోసారి ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసి చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే కరోనా బాధితులకు ధైర్యం కలిగించేలా మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశింది. డిసెంబరు 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ డిసెంబర్ 17కి వాయిదా వేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?