Maa Poll: టాలీవుడ్ ఇండస్ట్రీలో మా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఏకంగా ఈసారి అధ్యక్ష ఎన్నికల కోసం ఐదుగురు పోటీ చేస్తూ ఉండటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలు మా అధ్యక్ష భవనం చుట్టూ ఇంకా అదే రీతిలో గత మా అధ్యక్షులు పనితనం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు.. ప్రస్తుతం మా పని తాను అంతగా లేదని, మసక బారింది అని కామెంట్లు చేయటంపై తాజాగా ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో “మా” అధ్యక్షుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
“మా” పనితనం మసకబారింది అని నాగబాబు చెప్పటనీ తాను తప్పు పడుతున్నట్లు నరేష్ పేర్కొన్నారు. ఆయన అంత మాట అనటం తనకు ఎంతగానో జివ్వు అని అనిపించినట్లయిందని పేర్కొన్నారు. రేలా తన ప్రయాణంలో అనేక పదవులు అధిరోహించి నమః అధ్యక్షుడిగా గత రెండు సంవత్సరాలుగా.. మా పనితనం చూస్తే చాలా మెరుగ్గా క్లియర్ గా ఉందని నరేష్ పేర్కొన్నారు. ఘరానా కష్ట కాలంలో దాదాపు 900 మంది పైచిలుకు కరోనా వైద్య ఖర్చులు మా అసోసియేషన్ భరించింది అని స్పష్టం చేశారు.
ఇంకా మృతిచెందిన పలువురికి 24 గంటల్లోనే ఆర్థిక సాయం అందించడం జరిగిందని.. తన అధ్యక్ష హయాంలో అంతా మంచే జరిగిందని టీవీ ఇంటర్వ్యూలో నరేష్ స్పష్టం చేశారు. ప్రముఖ నటుడు వేణుమాధవ్, గీతాంజలి, జయప్రకాశ్ రెడ్డి లాంటి వారు చనిపోయిన క్రమంలో వారికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఎవరి తరం వారిదే అని తన ఆధ్వర్యంలో “మా” వెల్ఫేర్ సేవలు మెరుగ్గా జరిగాయని.. మెంబర్స్ ప్రాణాల భద్రత కోసం ఎంతో కృషి చేసినట్లు నరేష్ చెప్పుకొచ్చారు.