`బ్రేకింగ్ : బీజేపీ సారథ్యంలోని ఎన్డిఏలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం. ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు ప్రకటన వెలువడే చాన్స్`
ఈ మేరకు వివిధ మీడియా సంస్థల్లో రెండ్రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా దీనికి కొనసాగింపుగా, ఎన్డీఏ జగన్ పార్టీకి మంత్రి పదవుల్ని ఆఫర్ చేసిందని.. అందుకే ఆయన సడన్గా ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో ఊహించని వార్త తెరమీదకు వచ్చింది.
జగన్ ఇలా వార్తల్లోకి ఎందుకంటే…
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ అంటే చాలు కొన్ని మీడియా సంస్థలు ఒక రెడీగా ఉన్న కథనం వడ్డిస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీకి కేంద్ర కేబినెట్లో ఛాన్స్ ఇచ్చారు. జగన్ పార్టీకి మంత్రి పదవుల్ని ఆఫర్ చేసిన ప్రధానమంత్రి…అందుకే ఆయన సడన్గా ఢిల్లీ వెళుతున్న సీఎం అంటూ జోరుగా ప్రచారం చేస్తారని విశ్లేషిస్తున్నారు. అయితే, తమ నాయకుడి ఢిల్లీ పర్యటన పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని చెప్తున్నారు.
హైకోర్టులో అలా జరగడం…
ఏపీలో పాలనా వికేంద్రీకరణ పేరిట అక్కడ శాసన రాజధాని అనేదాన్ని మాత్రం కొనసాగిస్తూ పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని, న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు హైకోర్టు తరలించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వివాదం చెలరేగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. పలు సందర్భాల్లో ఏపీలో మూడు రాజధానులపై తన వైఖరిని స్పష్టం చేసిన కేంద్రం ప్రభుత్వం.. రాజధాని అంశం మా పరిధిలో లేదంటూ తేల్చేసింది.
బీజేపీ నేతలకు షాక్… జగన్కు గుడ్ న్యూస్
మూడు రాజధానుల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా…వైసీపీయేతర పార్టీలన్నీ రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ సర్కారు నిర్ణయం శాసనమండలి గండం దాటి గవర్నర్ సంతకం కూడా పొంది గెజిట్లో వెలువడింది కూడా. అయితే హైకోర్టు ధర్మాసనం వద్దకు చేరింది. వైఎస్ జగన్ సర్కారు నిర్ణయంపై దాదాపు 80 పిటిషన్లు దాఖలైనా అన్నిటికీ కలిపి ఒకే కౌంటర్ను రాష్ట్రం సమర్పించింది. తద్వారా ఎన్ని విమర్శలు ఎదురైనా మూడు రాజధానులపై వెనక్కి తగ్గడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇదే సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంది. కేంద్రం రాష్ట్ర నిర్ణయానికి ఓకే చెప్పేసింది. పలు దఫాలుగా తమ వైఖరి తేల్చిచెప్పింది. రాజధాని అమరావతిలోనే ఉంటుంది. భయపడాల్సింది లేదు అని కొందరు బీజేపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం ఇప్పటికే అనేక దఫాలుగా క్లారిటీ ఇచ్చింది. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది… ఏపీ రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.
షాక్ తగిలిందిగా?
అయితే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్పై వైసీపీ నేతలు, ఏపీ ప్రభుత్వ పెద్దలు క్లారిటీ ఇచ్చారు. ప్రధానితో సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం, మండలి రద్దు, జీఎస్టీ బకాయిలు తదితర అంశాలను ఖచ్చితంగా ప్రస్తావిస్తారని వివరిస్తున్నారు. వైసీపీకి కేంద్ర కేబినెట్లో ఛాన్స్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది, ఎన్డీఏ జగన్ పార్టీకి మంత్రి పదవుల్ని ఆఫర్ చేసిందని సదరు అంచనాలు వేసుకుంటున్న వారికి షాక్ తగలడం ఖాయమని అంచనా వేస్తున్నారు.